ఎడిక్షన్ అది ఏదైనా ప్రమాదమే. సిగిరెట్, జూదం, మద్యం ఇలా దేనికి బానిసగా మారినా దాని వలలో నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఆ లిస్టులో సెల్ ఫోన్ కూడా చేరింది. చాలా మంది ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ మోజులో పడి కుటుంబాలను, జీవితాలను నిర్లక్ష్యం చేకసుకొంటున్నారు.
చత్తీస్గఢ్ దుర్గ్ జిల్లాలోని భిలాయిలో ఓ భార్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి బానిసగా మారింది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసింది. నిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న భార్యను భర్త పలుమార్లు హెచ్చరించాడు. చివరికి ఫోన్ లాక్కొన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. మొబైల్ ఫోన్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు.