” ఒకప్పుడు అత్యంత పేద రాష్ట్రంగా పేరొందిన ఒడిస్సా ఈ రెండు దశాబ్దాల కాలంలో ఆకలి కేకలు నుంచి బయటకు వస్తోంది. ఒడిస్సా పేరు చెపితే రెండు, మూడు జిల్లాలలో.. నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాలలో తెలుగు ప్రజలు చేరారు. 5 దశాబ్దాల నుంచీ ఆంధ్రా ప్రాంత రైతుల వ్యవసాయ విధానాలను చూసి అబ్బురపడిన తండ్రీ, కొడుకులు మనవాళ్లను ప్రోత్సహించారు. ఒడిస్సా మాజీ సీఎం బిజూ పట్నాయక్, అయన కుమారుడు ప్రస్తుత సీఎం నవీన్ పట్నాయక్ . దేశంలోనే అత్యంత పాపులర్ సీఎంగా నవీన్ రికార్డ్ క్రియేట్ చేసారు.” నవీన్ పట్నాయక్ 2000 నుంచి ఇప్పటి వరకు .. 24 ఏళ్లుగా .. నాలుగు 2000, 2004, 2009, 2014, 2019.. వరుసగా ఐదు దఫాలుగా ఏక ఛత్రాధిపత్యంగా ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించిన నవీన్ ఒడిశాలో పేదల పరిస్థితిని మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు అమలు చేస్తున్నా.. రైతాంగాన్ని కూడా అదే రీతిలో ప్రోత్సహిస్తున్నారు.
దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన రెండో స్థానంలో నిలిచారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) కి చెందిన నవీన్ పట్నాయక్ 52.7 శాతం పాపులారిటీ రేటింగ్తో మొదటి స్థానంలో నిలిచారు. 51.3 శాతం పాపులారిటీ రేటింగ్తో యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానాన్ని సర్దుకున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ 48.6 శాతం ప్రజాదరణతో మూడో స్థానంలో, 42.6 శాతంతో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాలుగో స్థానంలో, తిప్రుర సీఎం మాణిక్ సాహా 41.4 శాతం ప్రజాదరణతో ఐదో స్థానంలో నిలిచారు.