చత్తీస్గఢ్ స్టేట్ అసెంబ్లీ రెండో, చివరి దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా, ఈనెల 7న తొలిదశలో 20 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన 70 నియోజకవర్గాలకు రెండో దశలో శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో 40 జనరల్, 17 ఎస్టీ, 9 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్, ఎనిమిది మంది మంత్రులు, నలుగురు ఎంపీలు సహా కాంగ్రెస్ నుంచి రాజకీయ ఉద్దండులు పలువురు రెండోదశలోనే తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. నక్సల్స్ ప్రభావిత బిద్రాన్వాగఢ్ నియోజకవర్గంలోని తొమ్మిది పోలింగ్ బూత్లలో మాత్రం భద్రతా కారణాల రీత్యా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుపనున్నారు.
బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో(ఎంపీ), అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నారాయణ్ చందేల్, కేంద్ర మంత్రి రేణుకా సింగ్, ఎంపీ గోమ్తి సాయి తదితరులు రెండో దశ బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలపగా, ఆప్ 43, బీఎస్పీ 43, జనతాకాంగ్రెస్ ఛత్తీ్సగఢ్(జె) 62, హమ ర్ రాజ్ పార్టీ 33, గొండ్వానా గణతంత్ర పార్టీ 26 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. మొత్తం 1,63,14,479 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 81,41,624 మంది పురుషులు, 81,72,171 మంది స్ర్తీలు, 684 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.