”భారత దేశంలో మొట్ట మొదటిసారిగా కాకినాడ శ్రీ పీఠంలో ”మహాశక్తి యాగం” నిర్వహించడం అమ్మవారి కృపా కటాక్షాలతోనే జరుగుతుంది..” అని శ్రీ పీఠం బాద్యులు శ్రీ పరిపూర్ణానంద స్వామి అభిలషించారు. ” మహాశక్తి యాగం.. ఒక యజ్ఞం.. ఒక యాగం.. అని స్వామీజీ స్పష్టం చేసారు. మంగళవారం కాకినాడ శ్రీ పీఠంలో పరిపూర్ణానంద మహాశక్తి యాగం ప్రారంభించారు. 30 రోజులపాటు జరిగే ఈ మహాశక్తి యాగానికి శ్రీ పీఠంలో అత్యంత వైభోపేతంగా ఏర్పాట్లు చేసారు. కాకినాడ పరిసర ప్రాంతాలతోపాటు, ఏపీ, తెలంగాణాలలో పలు చోట్ల నుంచి మహిళలు మహాకోటి కుంకుమార్చనలో పాల్గొనేందుకు వేలాదిగా తరలివచ్చారు.