సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహింద్ర గ్రూప్ చీఫ్ ఆనంద్ మహింద్ర తరచూ ట్విట్టర్లో స్ఫూర్తిదాయక పోస్ట్లు పెడుతుంటారు. మండే మోటివేషన్ పేరుతో పారిశ్రామిక దిగ్గజం షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పరమహంస యోగానంద కోట్ను మహింద్ర షేర్ చేశారు.
ఈ పోస్ట్ పలువురిలో స్ఫూర్తి నింపుతూ వారం ఆరంభంలో అందరిలో జోష్ నింపుతోంది. మీరు విచారంగా ఉండాలనుకుంటే ప్రపంచంలో ఏ ఒక్కరూ మిమ్మల్ని సంతోషపెట్టలేరు..కానీ మీరు మీ మనసును సంతోషంతో నింపుకుంటే మీనుంచి ఆనందాన్ని ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ దూరం చేయలేరని ఈ కోట్ పేర్కొంది.
వారంలో తొలిరోజు చికాకులను పారదోలేందుకు శాశ్వత పరిష్కారం..మండే మోటివేషన్ అని ఈ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ పలువురు నెటిజన్లను ఆకట్టుకుంది. స్ఫూర్తి నింపే పోస్ట్ ఇదేనంటూ ఓ యూజర్ రాసుకురాగా, అద్భుతం..స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్య అంటే ఇదేనని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో పేర్కొన్నారు. ఆనంద్ మహేంద్ర పోస్ట్ చాలా స్ఫూర్తివంతంగా ఉందంటూ.. సహచర పారిశ్రామిక దిగ్గజాలు కూడా ట్వీట్ చేయడం గమనార్హం.