ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఎల్నినోతో పాటు ఇతర అంశాలు రుతుపవనాలపై ప్రభావం చూపొచ్చని స్పష్టం చేసింది. రుతుపవనాల రెండో అర్ధభాగం సీజన్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడుతాయంది. దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాలు వర్షాభావానికి గురయ్యే ప్రమాదం ఉన్నదని తెలిపింది. జూలై-ఆగస్టు మధ్య గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో లోటు వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అయితే రుతుపవన కాలంలో వర్షాల అంచనాపై భారత వాతావరణ విభాగంద్రువీకరించాల్సి ఉంది. ఈ ప్రభావం ఉత్తర, మధ్య భారతాల్లో వ్యవసాయ రంగంపై పడుతుందని, ప్రధానంగా సీజన్లో చివరి రెండు నెలల్లో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలపై సోమవారం ఈ సంస్థ బులెటిన్ విడుదల చేసింది. రానున్న నెలల్లో ఎల్నినో ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉంది.