తిరుమలలో మార్చి నెలలో శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. మార్చి 3న పల్స్ పోలియో, 6, 20వ తేదీలలో సర్వ ఏకాదశి, 8న మహా శివరాత్రి, అలాగే 20 నుంచి 24 వరకు వార్షిక తెప్పోత్సవం, 25న తుంబూరు తీర్థ ముక్కోటి, లక్ష్మి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
టీటీడీ ఉద్యోగుల క్రీడలు
టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు మార్చి 1 నుంచి 18 వరకు జరుగనున్నాయి. తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషులకు, మహిళలకు వేరువేరుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర క్రీడలు జరుగుతాయని వారు తెలిపారు. టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో స్నేహలత క్రీడల నిర్వహణను పర్యవేక్షిస్తారని వివరించారు.