ఇటీవల హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో కొంతమంది దొరికిన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రముఖ దర్శకుడు క్రిష్ కూడా ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారించిన మాట కూడా తెలిసిందే. అయితే మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో సినీ ఇండస్ట్రీలో కలకలం రేగుతోంది.
ఆ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన వ్యాపారి సయ్యద్ అబ్బాస్ అలీని పోలీసులు విచారించగా.. రాడిసన్ హోటల్ ఓనర్ కొడుకు వివేక్, డైరెక్టర్ క్రిష్ మంచి స్నేహితులు.. వాళ్లిద్దరితో పాటు నిర్భయ్ సింధీ కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నారని, ముగ్గురూ డ్రగ్స్ తీసుకున్నారని చెప్పాడట. ఈ విషయాన్ని తన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో గజ్జల వివేకానంద డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ ను చేర్చినట్లు పోలీసులు తెలిపారు.