వసంత పంచమి రోజున సరస్వతీదేవికి తీవ్ర అవమానం జరిగిందని ఏబీవీపీ విద్యార్థులు నిరసనలకు దిగారు. వారికి బజరంగ్ దళ్ మద్దతుగా నిలిచింది. త్రిపురలోని ఓ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన పూజలు ఉద్రిక్తతకు దారితీశాయి. సరస్వతీదేవి విగ్రహానికి ఆచ్ఛాదన లేకపోవడమే దానికి కారణం.
సరస్వతీదేవి విగ్రహాన్ని అవమానించిన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. అమ్మవారి విగ్రహంపై వెంటనే చీర కప్పాలని సూచించింది. త్రిపుర ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. మతపరమైన మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది.