రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని తేల్చి చెప్పింది.
ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ పథకం ఒక్కటే మార్గం కాదు. రాజకీయ పార్టీలకు విరాళాలు అనేది క్విడ్ ప్రోకోకు దారి తీస్తుంది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం కుదరదు. అది సమాచార హక్కును అతిక్రమించడమే అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది.