భారత దేశపు అత్యున్నత పురస్కారం అయిన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు ఎల్ వి గంగాధర శాస్త్రిని వరించింది. . 2023 సంవత్సరానికి గాను, ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగంలో ఆయనకు ఈ ‘అకాడమీ పురస్కారం’ దక్కింది. కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో, భారత దేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథంగా పాడడంతో పాటు, మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతంలో, తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, ‘భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత’ గా శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ తీర్థ స్వామి, డాII ఏ పి జె అబ్దుల్ కలాం చేతులమీదుగా విడుదల చేసి, అంతటి తో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా, స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసినందుకు గంగాధర శాస్త్రి కి ఈ అవార్డు దక్కింది. శాస్త్రికి అత్యున్నత అవార్డు దక్కడం పట్ల సాహిత్య అభిలాషులు, భగవత్ గీత ఫాలోవర్స్ ఆనందం వ్యక్తం చేసారు.