కరోనా కట్టడికి కొవాగ్జిన్ రూపకల్పనలో విశేషంగా కృషి చేసింది భారత్ బయోటెక్. ఇప్పుడు ఆ యాజమాన్యం భారీ విరాళం ప్రకటించి సంచలనం సృష్టించింది. తమ ఉదారతను చాటింది. మానవతా దృక్పథంతో సేవాభావాన్ని మరోసారి నిరూపించుకుంది. భద్రాద్రి రామయ్య సన్నిధికి వచ్చే భక్తుల నిత్యాన్నదానానికి కోటి రూపాయల విరాళాన్ని అందజేసింది. ఆ మొత్తాన్ని ఆలయానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో జమచేసింది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రతి రోజు జరిగే అన్నదానానికి కోటి రూపాయలు అందజేసినట్లు భారత బయోటెక్ ప్రకటించింది. గతంలో ఏపీలోని విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి కూడా భారత్ బయోటెక్ రూ.కోటి విరాళాన్ని అందజేసింది. ఆన్లైన్ ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేసింది.