టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ఖరారు అయింది. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో యూత్ లో మరింత జోష్ తీసుకురావడానికి లోకేష్ సైతం పాదయాత్రకు రెడీ అయ్యారు. జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారయింది. 100 నియోజకవర్గాలు కవరయ్యేలా … 400 రోజులు 4 వేల కిలోమీటర్లు.. లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పం టూ ఇచ్చాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది.
“యువగళం” పేరుతొ చేపట్టనున్న ఈ యాత్రలో లోకేష్ అన్ని వర్గాల ప్రజలను కలుస్తారు.
అయితే లోకేష్ పాదయాత్రకు వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.ఇదే సమయంలో తాజాగా మంత్రి మేరుగు నాగార్జున స్వయంగా లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా సందర్భాల్లో టీడీపీ కార్యక్రమాలని ఏదో రకంగా వైసీపీ నాయకులు అడ్డుకుంటూ వచ్చారు. అలాగే గుడివాడ లాంటి చోట్ల టీడీపీకి పోటీగా వైసీపీ వాళ్ళు వచ్చి అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో గొడవలు కూడా జరిగాయి. “గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, జగన్ పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. మరి ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు వైసీపీ బ్రేకులు వేయకుండా మాత్రం ఉంటుందని చెప్పలేం. ” అని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.