” 2019 నుంచి 2024 వరకు 39 అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇక ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో మనుగడ కష్టం..అనుకున్న గడ్డు పరిస్థితుల నుంచి.. గెలుపు దిశగా తీసుకురావడంలో అయన అవిరళ కృషి అభినందనీయం.. పార్టీలో అక్రమ కేసులతో అల్లాడిపోతున్న కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ.. వైసీపీ అక్రమాలు, అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. (రాము). ”
తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఎన్నికల పొత్తులో భాగంగా అనపర్తి సీటును రాజకీయాలతో ఏ మాత్రం సంబంధంలేని ఓ వ్యక్తికి కట్టబెట్టారు. శివరామకృష్ణంరాజు అనే బీజేపీ కార్యకర్త.. బిక్కవోలు మండలం రంగాపురంలో వార్డు మెంబర్గా పోటీ చేసి 6 (ఆరు) ఓట్లు సాధించిన బడా నేతను ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై పోటీకి దించింది బీజేపీ. ”బలహీనమైన అభ్యర్థిని పెడతాం.. మాకు ఇలా చేయండి.. దీని వల్ల వైసీపీ ఎమ్మెల్యే సీటుతో పాటు,, రాజమండ్రి ఎంపీ సీటు కూడా మీకు సునాయాసంగా వచ్చేస్తాయ్.. ” అని బీజేపీలో కీలక నేత.. వైసీపీలో కీలక నిర్ణాయక శక్తి కలిగిన వారితో లోపాయికారిగా ఒప్పందం పెట్టుకున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.. వీటిపై ఆ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడంతో సదరు బీజేపీ అభ్యర్థిని వాపసు తీసుకున్నారు. అయితే దీనిపై ఇంకా బీజేపీ, టీడీపీ ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. (ఈ కధనం పబ్లిష్ చేసే సమయం.. గు రువారం రాత్రి.. 11 గంటల సమయానికి ). శివరామకృష్ణ అనే బీజేపీ ప్రకటించిన అభ్యర్థి కనీసం బిక్కవోలు మండలంలో కూడా బీజేపీలో సైతం ఎవరికీ పరిచయంలేని వ్యక్తి. అలాంటి అతన్ని అభ్యర్థిగా పెట్టడం ద్వారా వైసీపీకి లబ్ది చేకూర్చడంతో పాటు.. బీజేపీ పరువు తీయడానికి తెరవెనుక లాబీయింగ్ చేసిన వారిపై బీజేపీ దృష్టి పెట్టాలని బీజేపీలోనే ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. గతంలోనూ సదరు వ్యక్తి ఇలాంటి ఎన్నో లాబీయింగ్లకు పాల్పడి భారీగా ఆరగించారని కూడా చెపుతున్నారు. సదరు వ్యక్తిపై జరిపిన స్టింగ్ ఆపరేషన్ వీడియాలు కూడా అధిష్టానానికి పంపినట్లు చెపుతున్నారు. బీజేపీ పెద్దలు సదరు నేతపై చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదని కూడా చెప్పుకుంటున్నారు.
పొత్తులో భాగంగా బీజేపీకి అనపర్తి సీటు వదులుకోవాల్సి వస్తోందని.. తెదేపా ఇంచార్జ్ రామకృష్ణారెడ్డికి ఆ పార్టీ అధక్షుడు చంద్రబాబు నాయుడు నచ్చచెప్పాలని ప్రయత్నించారు. అయితే రామూ మాత్రం ఎక్కడా తగ్గలేదు. పార్టీ కోసం ఇన్నాళ్లూ పెట్టిన ఎఫర్ట్ వృధాగా పోతుందని.. భవిష్యత్తులో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోందని గట్టిగ చెప్పడంతో చంద్రబాబు బీజేపీ పెద్దలతో ”పునరాలోచించాలని చేసిన విజప్తి ఫలించింది.. దీంతో పాటు ఈ పన్నాగం వెనుక పురందేశ్వరిని పార్లమెంట్ అభ్యర్థిగా ఓడించడానికి జరిగిన కుట్ర ఉందని.. ఇది టీడీపీకి కూడా చాలా నష్టం తెస్తుందని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. చివరికి బీజేపీ, తెలుగుదేశం చర్చలతో బీజేపీకి కేటాయించిన సీటును తెలుగుదేశానికి ఇవ్వడంతో వ్యవహారం సద్దుమణిగింది.
బీజేపీ అభ్యర్థి పోటీలో ఉంటె లక్ష మెజార్టీతో గెలుపొందవచ్చన్న ఆశలు పెట్టుకున్న వైసీపీ అభ్యర్థి, ఆ పార్టీ నేతలకు తాజాగా జరిగిన మార్పుతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.