అప్పటి బ్రిటిష్ అధికారి రూధర్ ఫర్డ్ అతిథి గృహం ఆనవాళ్లు లేకుండా పోతోంది. చరిత్రకు గుర్తులుగా ఉంటే కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. శీతల ప్రాంతంగా, ఆంధ్రా కశ్మీర్ గా పేరొందిన లమ్మసింగి సమీపంలో ఆనాటి బ్రిటీష్ అధికారి అతిథి గృహం ఉంది. ఆయన అప్పట్లో అక్కడినుంచి విధులు నిర్వహించేవాడు. అయితే ఆ ఆనవాళ్లు నేడు అంతరించిపోతున్నాయి. పర్యాటకులు ఆ ప్రాంతంలోని అతిథిగృహాన్ని చూసి ఆనందిస్తారు. ఆసక్తి చూపుతారు. లమ్మసింగి, చెరువులవెనం, తాజంగి రిజర్వుర్ ప్రాంతంలో ఈ అతిథి గృహం ఉంది. ఈ ప్రాంతానికి వస్తున్న పర్యాటకులు దాన్ని చూసి నాటి బ్రిటీష్ చరిత్రను గుర్తుచేసుకుంటారు. అయితే ఆ ప్రాంతం అంతా పూర్తిగా శిథిలావస్థలో ఉంది. చెట్లు పిచ్చిమొక్కలతో నిండిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి కనుమరుగవుతున్న బ్రిటిష్ అతిథి గృహాన్ని మొరుగుపరిచాలని పర్యటకులు, చరిత్రకారులు కోరుతున్నారు.