గోదావరి పొంగిప్రవహిస్తోంది. వరదలతో తెలుగురాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల గ్రామాలు ముంపునకు గురయ్యాయి. చాలా రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలో నీట మునిగిన వరద ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. వరద ప్రాంతాల పరిశీలన కోసం శనివారం రాత్రికే వరంగల్ చేరుకున్న కేసీఆర్ రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం వరద ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే చేశారు. ఏరియల్ సర్వేకు వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేను అధికారులు రద్దు చేశారు. రోడ్డు మార్గం ద్వారానే ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆదివారం ఉదయం 11 కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. ములుగు, ఏటూరు నాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి నదికి ప్రత్యేక శాంతి పూజలు చేశారు. నదిలో వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వరద నష్టంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు.