ప్రముఖ ఫేషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల హైద్రాబాద్ లోని బంజారా హిల్స్ లోని తన నివాసంలో అనుమానాస్పదంగా చనిపోయిన విషయం తెలిసింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నఘటన శనివారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిన్న రాత్రే ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యూష మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి చేశారు. ప్రత్యూష ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. దేశంలోనే ఆమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుఉంది. మహిళా సెలబ్రిటీలకు డిజైనింగ్లో ప్రత్యూష సిద్ధహస్తురాలు. దేశంలోని టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష కూడా ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్ లోని టాప్ హీరోయిన్లతో పాటు పలువురు క్రీడాకారులకు కూడా ఆమె డిజైనింగ్ చేశారు. ఆమె తనే సొంతంగా ఫ్యాషన్ స్టూడియో ఏర్పాటు చేసుకుని సొంతంగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆమె యూకేలో తన మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. అందులో ఆమె తన ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించారు. తాను స్వేచ్ఛను కోరుకున్నానని.. తాను ఎవరికీ భారం కాదల్చుకోలేదని కూడా ఆమె తెలిపారు. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అనేక సార్లు యత్నించినట్లు… ప్రతి రోజు తాను బాధపడుతూనే ఉన్నట్లు సూసైడ్ నోట్లో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.