కోనసీమలో అల్లర్లకు వైయస్సాఆర్ పార్టీనే కారణమని.. వారే తమ మనుషుల్ని పెట్టుకుని అమలాపురంలో విధ్వంసం సృష్టించారని టీడీసీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వారి ఇళ్లను వారే తగలబెట్టుకుని ఇతరులపై బురద జల్లుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే జనసేన నేత పవన్ కూడా అదే మాట అన్నారు.న ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కోనసీమలో చిచ్చు రేపారనేది చంద్రబాబు విమర్శ. జగన్ చేస్తోన్న దానికి ఇంతకు ఇంతా .. చెల్లిస్తా అని చంద్రబాబు హెచ్చరించారు. బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది.. ఎస్సీలకు చెందిన 28 పథకాలు రద్దు చేసింది. డ్రైవర్ను అనంతబాబు చంపేస్తే.. కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందన్నారు చంద్రబాబు.
నేటి నుంచి ప్రారంభం కానున్న మహానాడు కోసం మంగళగిరిలోని టీడీపీ దేపా కార్యాలయం నుంచి ఒంగోలుకు ప్రదర్శనగా వెళ్లిన చంద్రబాబు దారిలో చిలకలూరిపేట సమీపంలో కార్యకర్తలు, ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. సీఎం జగన్ పరిపాలన చేతకాక, అప్పులు పుట్టక, పథకాలు కొనసాగించలేక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని వివరించారు. ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసని.. ‘క్విట్ జగన్… సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదం రాష్ట్రమంతా మార్మోగాలని పిలుపునిచ్చారు.
లక్షల మంది రోడ్డెక్కితే జగన్కు రాజపక్స గతే పడుతుందని చంద్రబాబు అన్నారు. చిలకలూరిపేటలో రూ.2కే 20 లీటర్ల తాగునీరు ఇచ్చే ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభిస్తుంటే తమ పార్టీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. లక్షల మంది ఆగ్రహంతో రోడ్డెక్కితే జగన్ మోహన్రెడ్డి కూడా శ్రీలంక ప్రధాని మాదిరి పారిపోరా? రాజపక్సకు, అతని మంత్రులకు పట్టిన గతే జగన్కు పట్టదా? అని ఆక్షేపించారు. గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ప్రజలు నిలదీస్తుంటే సామాజిక న్యాయ బస్సుయాత్ర పేరిట మంత్రులు నాటకాలాడుతున్నారని, ఎస్సీల సంక్షేమం కోసం తాము ప్రవేశపెట్టిన 25 పథకాల్ని రద్దు చేయడమే సామాజిక న్యాయమా ? అని నిలదీశారు.