“సీఎం అయ్యాక మూడున్నరేళ్లు జనానికి దూరంగా ఉంటూ వస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటు మారుస్తున్నారు. జనంలోకి తిరక్కపోయినా.. జనాన్నే తన వద్దకు రప్పించే ‘ప్రజా దర్బారు’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు..”
ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించేందుకుగాను త్వరలో ‘ప్రజాదర్బార్‘ను ముఖ్యమంత్రి జగన్ చేపట్టనున్నట్లు తెలిసింది. వారంలో ఐదు రోజులపాటు రోజూ ఉదయం ఆయన విన్నపాలు స్వీకరించనున్నారు. ఆగస్టు నెల నుంచి దీన్ని చేపట్టే అవకాశం ఉందనిముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం ప్రజలనుంచి సీఎం విజ్ఞప్తులను స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు అపాయింట్మెంట్లు ఉంటాయట.
ఎమ్మెల్యేలకు కూడా.. ప్రజాదర్బార్ లోనే రోజు గంట సేపు జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇస్తారట. అలాగే ఇతర ప్రజాప్రతినిధులకు కూడా కొంత సమయం కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారు.