ఎట్టకేలకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కుదిరినట్టు చెబుతున్నారు. దీంతో టీడీపీ ఎన్డీయేలోకి రీ ఎంట్రీ ఖాయమైందని సమాచారం. ఈ అంశంపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. బీజేపీకి ఆఫర్ చేసే సీట్లపై చంద్రబాబు, పవన్ అమిత్ షాతో చర్చించారు. బీజేపీకి కోరుకుంటున్న సీట్ల వివరాలను ఆ పార్టీ నాయకత్వం చంద్రబాబు ముందుంచినట్టు సమాచారం. ఇప్పటికే వీరి మధ్య ప్రాథమిక చర్చలు పూర్తయిన నేపథ్యంలో.. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది.
బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ సీట్ల అంశంపై అమిత్ షాతో జరిగిన చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై రాష్ట్రస్థాయిలో చర్చించాలని, బీజేపీ పరిశీలకులు, రాష్ట్ర బీజేపీ చీఫ్తో మాట్లాడాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. సీట్ల పంపకం అంశంపై కాసేపట్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రకటన చేయబోతుంది. సీట్ల సర్దుబాటు వివరాలు ఆన్లైన్లో ఉంచబోతున్నారు. చర్చలు ఫలప్రదం కావడంతో మార్చి 14వ తేదీన జరగబోయే ఎన్డీయే సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.