” మనమూ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి రెడీ గా ఉండండి. మళ్ళీ మనమే విక్టరీ సాధించాలి.” అని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈసారి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న జగన్ మరోసారి మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఎన్నికలకు కేవలం 9 నెలలు మాత్రమే ఉన్నాయని..ఈ 9 నెలలు కష్టపడితే మళ్లీ తమదే విజయమని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.