రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై ప్రజా సంఘాలు, మహిళలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న అత్యాచారాలను ఆపాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. కామాంధులు రెచ్చిపోతున్నారు. సాక్షాత్ ఏపీ ముఖ్యమంత్రి, డీజీపీ, ఇతర మందీ, మార్బలం ఉండే గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. అధికార వైకాపా నేతలు మాత్రం చాల లైట్గా తీసుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి, సినీ నటి ఆర్.కె.రోజా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. “రాష్ట్రంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితేనే ఇంత రాద్దాంతమా?” అంటూ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర మహిళల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. బాధ్యత యుతమైన మంత్రి ఏ మాత్రం బాధ్యత లేకుండా నిసిగ్గుగా మాట్లాడటంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.