తెలంగాణలో బీజేపీ మెజారిటీ సీట్లులో విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి భారతావనికి మోదీ గ్యారంటీ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. లోక్ సభలో బీజేపీ 370పైగా స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మోదీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్పారు. ఈ ఎన్నికలకు మరోసారి మోదీ సర్కారు అనేది మా పార్టీ నినాదమన్నారు. ప్రజలు ఆర్థిక సాయం చేయాలని కోరారు. ప్రధాని మోదీ 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డిలో పర్యటిస్తారని ఆదిలాబాద్ లో రూ.6,697, సంగారెడ్డిలో రూ.9,021 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని చెప్పారు.