దేశంలోనే దిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. పెళ్లికి ఇంకా నాలుగు నెలలు సమయం ఉన్నా వేడుకలు అప్పుడే మొదలయ్యాయి. అట్టహాసంగా జరగనున్న ప్రీవెడ్డింగ్ వేడుకలకు ప్రపంచ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు.
వేదికగా నిలిచిన గుజరాత్ లోని జామ్ నగర్ కు ఇప్పటికే బాలీవుడ్ తారలు చేరారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆహ్వానం అందింది. దీంతో ఆయన తన భార్య ఉపాసనతో విమానంలో వెళ్లారు. అయితే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతోంది. విమానంలో ఉపాసన నిద్రించిన సమయంలో రామ్ చరణ్ ఆమె పాదాలు నొక్కుతూ అందులో కనిపించాడు. అంత పెద్దహీరో అయినా గర్వం లేకుంగా భార్యకు సేవలు చేయడం చూసి భర్తలంతా ఆదర్శంగా తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.