పవన్ క ల్యాణ్ వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది.. అన్నవరం నుంచి వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ ఉదయం సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు చేసారు. తొలిరోజు యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో పవన్ కళ్యాణ్ మమేకం కానున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకునేందుకు ‘జనవాణి’ నిర్వహించున్నారు.
అన్నవరం నుంచి నరసాపురం వరకు షెడ్యూల్ ఖరారైంది. . జూన్ 16న పిఠాపురంలో వారాహి యాత్ర, సభ ఉంటుంది. 18న కాకినాడలో.. 20న ముమ్మిడివరంలో… 21న అమలాపురంలో.. 22న పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా.. వారాహి యాత్ర, రాజోలు నియోజకవర్గం మకిలిపురంలో.. 23న నరసాపురంలో వారాహి యాత్ర, సభ ఉంటుంది. అన్ని అనుమతులు ఉన్నాయని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. పవన్ అన్నవరం వస్తున్నందుకు బందోబస్తు కావాలని… ఈవో పోలీసుల్ని లిఖితపూర్వకంగా కోరడం విశేషం. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఇదంతా రాజకీయ కుట్రంటూ వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారాహి పాదయాత్ర విజయవంతం కావాలని ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆకాంక్షించారు. ఇక ఏపీలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా మాట్లాడిన పవన్…. డిసెంబర్లో తెలంగాణతో పాటు ఏపీలోనూ ఎన్నికలు జరగుతాయన్నారు. తెలుగురాష్ట్రాలు ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు వెళ్తాయన్నారు. పొత్తులపైనా స్పష్టత ఇచ్చారు పవన్ కల్యాణ్. కుదిరితేనే పొత్తులకు… లేదంటే.. ఒంటరి పోరు.కు కూడా పవన్ సిద్ధమవుతున్నారు.