”గత ఏడాది జులైలో 9507 ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది జూలైలో 55 శాతం తగ్గి కేవలం 4313 ఇళ్లు మాత్రమే విక్రయాలు జరిగాయి.” ఇది హైదరాబాద్లో గృహాల అమ్మకాలు తగ్గిపోతున్నాయని చెప్పే గణాంకాలు. అలాగే గత ఏడాది జులైలో రూ.4572 కోట్లు విలువ చేసే ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది జులైలో 54 శాతం తగ్గి రూ.2100 కోట్లు విలువ చేసే ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి చూసుకుంటే.. ప్రతి నెల అంతకుముందు ఏడాదిలో జరిగిన రిజిస్ట్రేషన్ల కంటే తక్కువగా జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.హైదరాబాద్ జిల్లాలో 15 నుంచి 16 శాతానికి ఎగబాకగా.. రంగారెడ్డి జిల్లాలో 42 శాతం నుంచి 38 శాతానికి పడిపోయాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిల్లాల వారిగా జరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యధికంగా 41 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. సంగారెడ్డి జిల్లాలో గత ఏడాది జులైలో జరిగిన 5 శాతం రిజిస్ట్రేషన్లే ఈ ఏడాది జరిగాయి. జిల్లాల వారిగా ధరలను పరిశీలిస్తే.. ఒక్కో చదరపు అడుగుపై 9 శాతం పెరిగి సగటున చదరపు అడుగుకి రూ.3553 ఉంది. హైదరాబాద్లో 10 శాతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 20 శాతం, రంగారెడ్డిలో 5 శాతం, సంగారెడ్డిలో 27 శాతం లెక్కన ధరలు పెరిగినట్ల నైట్ ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది.