” ప్రభుత్వ ఓటు ఎట్టి పరిస్థితులలో చీలకుండా చూస్తా..” అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు నుంచీ చెపుతూనే ఉన్నారు. అలాగే టీడీపీ సైతం .. జనసేన జట్టుతోనే ఎన్నికలకు వెళ్లాలని దృఢ నిశ్చయంతోనే ఉన్నారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య వైరం క్రియేట్ చేస్తూ.. సామాన్య కార్యకర్తలలో అపోహలు తలెత్తేలా చేయడానికి వైసీపీ వ్యూహకర్తలు బృందం ఇప్పటికే ముమ్మరంగా పని మొదలెట్టినట్లు చెపుతున్నారు.
” జనసేన బ్యాచ్ అల్లర్లకు జనంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ బ్యాచ్ కుర్రాళ్ళు బైక్ ల సైలెన్స్లు తీసేసి నానా హంగామా చేస్తుంటారు. వాళ్లతో ఎన్నికలకు వెళితే టీడీపీకి మైనస్ అవుతుంది… అంటూ ఓ వర్గం వారితో ప్రచారం చేయించడం,,
”తెలుగుదేశం గెలవాలంటే జనసేన అండ ఉండాలి.. అందుకు మనం కనీసం 60 అసెంబ్లీ సీట్లు అయినా అడగాలి.. ఎన్నాళ్ళు ఈ పాలేరు తనం.. అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా జనం.. జనసేన కార్యకర్తలు నమ్మే రీతిలో వ్యూహాలు రూపొందినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో 6 శాతం ఓట్లు ఉన్న జనసేన 60 సీట్లు అడగడమేంటి? అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం, 60 సీట్లు ఇవ్వకపోతే పొత్తు ఒప్పుకోవద్దు.. అంటూ సేన నేతలు, కార్యకర్తలలో అపోహలు క్రియేట్ చేయడమే పనిగా ఆంధ్రప్రదేశ్ లో వేలాదిమంది వైసీపీ సోషల్ మీడియా బృందం సీరియస్ గా యత్నాలు మొదలెట్టినట్లు ఇరు పార్టీలు గుర్తించాయి. అయితే ఇలాంటి వైరాలను టీడీపీ, జనసేనలో సైతం కొందరు నమ్మే ప్రమాదం లేకపోలేదు. అయితే 2019 ఎన్నికలలోనే ఇలాంటి నక్క జిత్తుల వ్యవహారాలు నమ్మి ఆంధ్రా నాశనం అయింది. మరోసారి నమ్మితే ఇంక ఎవరు ఏమీ చేయలేరు.. అని ఓ రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.
లోకేష్- పవన్ భేటీ..రాజమండ్రిలో..
ఈ నెల 23న రాజమండ్రిలో టీడీపీ-జనసేన తొలి సమావేశం జరుగుతుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లోకేశ్- పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవతుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై చర్చిస్తుంది. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించిన ఇరు పార్టీలు.. ఇక రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఈ మీటింగ్ లో ఇరు పార్టీల నేతలు ఎంత పక్కా ప్రణాళికలతో, సమన్యయంతో వెళతారో చూడాలి. ఓ వైపు నారా భువనేశ్వరి .. చంద్రబాబు అరెస్ట్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి యాత్ర చేయబోతున్నారు. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి యాత్ర చేయనున్నారు. లోకేష్ కూడా భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.