”ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జున సాగర్ ను ఆక్రమించేశారు. ఆంధ్రోళ్ళు తెలంగాణ నీటిని ఎత్తుకుపోతారు. ” పోలింగ్ కు ముందు తెలంగాణ ప్రజల్లో ఈ భావనను కలిగించగలిగితే ఓటింగ్ లో భారీగా లబ్ధిపొందేది బిఆర్ఎస్ మాత్రమే! జగన్ చేతలను, మాటలను జనం నమ్మడంలేదన్న విషయాన్ని వారు పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. సాగర్ వద్ద పోలీస్ డ్రామా.. “వ్యూహాత్మక సమయం” జగన్ ప్రభుత్వ తప్పుల ఖాతాలో నమోదు అయింది.
నాలుగున్నర ఏళ్ళు నిద్రపోయిన జగన్ ప్రభుత్వం సాగర్ డామ్ మీదికి ఆకస్మికంగా, అదీ తెలంగాణాలో పోలింగ్ కు ముందు 1200 మంది పోలీసుల్ని పంపి సంచలనాన్ని రేకెత్తించడానికి అసలు కారణం కెసిఆర్ ను ఎన్నికల్లో గట్టెంకించడమేనని ఇంగిత జ్ఞానం వున్న ఎవరికైనా అర్ధమైపోతుంది.
ఏపీ పోలీసులపై కేసు
“మన హక్కులను నిలబెట్టుకునే చర్యలు తీసుకోడానికి సమయాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకునే అధికారం ప్రభుత్వానికి వుంది. చంద్రబాబే సరిగా పనిచేసి వుంటే మాకీ సమస్య వుండేది కాదు” అని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు – సాగర్ డామ్ మీద పోలీస్ డ్రామాను సమర్ధించుకునే ప్రయత్నం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నమ్మే పరిస్థితి కనిపించడంలేదు. నాలుగున్నర ఏళ్ళు నిద్రపోయిన ఎపి ప్రభుత్వ “వ్యూహాత్మక చర్య” వల్ల ఎపి పోలీసులపై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ పరిణామాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఉపయోగించుకోవాలని జగన్ అండ్ కో వేస్తున్న ఎత్తులు రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.
నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపేయాలని ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్ నెలకు సంబంధించిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీలను విడుదల చేసినట్లు లేఖలో స్పష్టం చేశారు. అయితే, నవంబర్ 30 తర్వాత నీటి విడుదలపై తమకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి అందలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
అక్టోబర్ 10- 2024 ఏప్రిల్ 18 మధ్య 15 టీఎంసీల నీటి మూడు విడతల్లో 5 టీఎంసీల చొప్పున ఇవ్వాలని ఏపీ కోరినట్టు కృష్ణా బోర్డు తెలిపింది. తొలి విడతగా అక్టోబర్ 10 నుంచి 20 వరకు 5 టీఎంసీలు విడుదల చేశామని, రెండో విడతగా జనవరిలో 5 టీఎంసీలు.. మూడో విడతగా ఏప్రిల్లో 5 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందని తెలిపింది. ఎలాంటి సమాచారం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నాడు నీటిని విడుదల చేసిందని.. విడుదలను తక్షణమే ఏపీ ప్రభుత్వం ఆపాలని కృష్ణా బోర్డు కోరింది.
రోడ్డునపడ్డ రహస్య ఒప్పందం
తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. ఏపీ వైపున భారీగా పోలీసులను మోహరించారు. సుమారు 1200 మంది పోలీసులు అక్కడ భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోగా.. కేఆర్ఎంబీ అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి స్మితా సభర్వాల్, నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా డ్యామ్పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, నీటి పారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. దీంతో ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులపై నాగార్జునసాగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా శ్రీశైలం జలాశయాన్ని ఏపీ, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఇది సక్రమంగా అమలు కావడంలేదు. నీటి విడుదల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఏపీ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంటాయి.
కుడి కాల్వ నుంచి ఏపీకి నీటిని తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉండేవి. ప్రస్తుతం ఇలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. అంతేకాదు, నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం తమకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదని తెలంగాణ చెబుతోంది
పరిస్ధితి బాగానే వున్నా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి తనకు రాజకీయ సహాయం చేసిన “మిత్రుడు” కెసిఆర్ని గట్టెక్కించే ప్రయత్నమే సాగర్ డామ్ మీద పోలీసు డ్రామా అని తేటతెల్లమైపోయింది.