”అసెంబ్లీ ఎన్నికలలో ఇన్ని స్థానాలు గెలుస్తాం..” అన్న దానితో ఏమాత్రం సంబంధం లేకుండా ”తెలంగాణాలో మళ్ళీ అధికారం మాదే.. డిసెంబర్ 4 న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం..” అంటూ అపార్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ”
కేసీఆర్ మాటల వెనుక మర్మం మాత్రం వేరే ఉందంటూ కాంగ్రెస్ నేతలు శంకిస్తున్నారు. అనుమానాలు తలెత్తడంతో హుటాహుటిన డీకే శివకుమార్ ను హైదరాబాద్ కు పంపింది ఆ పార్టీ హైకమాండ్. గెలుస్తారని భావిస్తున్న75- 80 మంది అభ్యర్థుల్ని కనిపెట్టుకుని ఉండేలా ఏఐసీసీ పరిశీలకుల్ని నియమించారు. కౌంటింగ్ లో వారు గెలుస్తారంటే… పత్రం తీసుకునే వరకూ వారి వెంటే ఉండి… హైదరాబాద్ వస్తారు. కౌంటింగ్ ముగిసే సమయానికి గెలిచిన అభ్యర్థులందర్నీ ఒక్క చోటికి చేర్చాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగ నిర్ణయించుకుంది. తమ అభ్యర్థులతో కేసీఆర్ నేరుగా మాట్లాడుతున్నారని డీకే శివకుమార్ ఆరోపిస్తున్నారు.
నేతలు బలంగా నమ్ముతున్నారు. ఎగ్జిట్ పోల్స్ తమకు పూర్తీ వ్యతిరేఖంగా వచ్చినా.. కేసీఆర్, కేటీఆర్ లు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. మజ్లిస్ కు వచ్చే ఆరు సీట్లు ఎలాగూ బీఆర్ఎస్ వైపే ఉంటాయి. 40 నుంచి 45 సీట్లు వచ్చినా మిగతా మిగతా అవసరమయ్యే ఆరేడు స్థానాలను.. కాంగ్రెస్ నుంచి కవర్ చేసుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని లోపాయికారి అంచనా వేసుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ కి బీజేపీ వెనుకుండి మద్దతు ఇస్తుండటంతో కూడా కాంగ్రెస్ కాస్త భయపడుతుంది. అయితే కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ అగ్రనేత, సమర్థ రాజకీయ0 తెలిసిన డీకే శివకుమార్ ని హైదరాబాద్ పంపి.. పూర్వ కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి తెరతీసింది.