కనుమూరి రఘురామ కృష్ణంరాజు టీడీపీలో చేరనున్నారు. 2019 లో నర్సాపురం నుంచి వైసీపీ తరపున గెలుపొందిన రఘురామ.. ఇటీవలే జగన్ పార్టీకి రాజీనామా చేసారు. జగన్మోహన్ రెడ్డితో విభేదాలు తీవ్ర స్థాయికి చేరడం.. RRR ని సీఐడీ కేసులో ఇరికించి .. థర్డ్ డిగ్రీ ప్రయోగించడం.. తర్వాత కోర్టుల ద్వారా రఘురామ బయటపడటం తెలిసిందే. అప్పటి నుంచీ జగన్ పై కక్ష్య పెంచుకున్న ఈ వైసీపీ రెబర్ ఎంపీ .. జగన్ పాలనలో అరాచకాలు, అక్రమాలపై ”రచ్చబండ” పేరుతొ ఢిల్లీ నుంచే రోజూ మీడియా సమావేశాలు పెట్టి జగన్ ని డీ ఫ్రెమ్ చేయడంలో సక్సెస్ అయ్యారు.
తాజాగా రఘురామా.. నర్సాపురం పార్లమెంట్ నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలనీ ప్రయత్నించారు. బీజేపీ అధినాయకత్వం తిరస్కరించడంతో… తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వారం రోజులలో రఘురామా.. టీడీపీ తీర్థం తీసుకోనున్నారు. నర్సాపురం నుంచి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు చంద్రబాబు, రఘురామ చర్చలు జరిపారు.