ఈ ఆధునిక కాలంలో జీవనం యాంత్రికంగా మారింది. దీంతో ఒత్తిడి రేటు అధికమవుతూ వస్తోంది. ఈ ఒత్తిడిని తగ్గించుకొనడానికి విపశ్యన ధ్యాన బోధనలు చాలా అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. అది ప్రాచీన భారతం మనకందించిన అద్భుత వరంగా అభివర్ణించారు. విపశ్యన గురువు ఎస్.ఎన్.గోయెంకా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విపశ్యన ధ్యాన పద్ధతులు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. అది ఆధునిక సైన్సే.. వికసిత భారతానికి సాధనం. దీనిని భవిష్యత్తు తరానికి అందించాలని మోదీ చెప్పారు. విపశ్యన ధ్యాన బోధనలతో ఫలితాలు సమర్థవంతంగా ఉంటాయని గోయెంకా చెప్పేవారని మోదీ గుర్తుచేసుకున్నారు. నేటి యువత దీనిని అనుసరిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.