తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అక్రమాస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు 2014లో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.100కోట్ల జరిమానా విధించింది. దీంతో చెందిన ఆమెకు చెందిన 28కిలోల బంగారు ఆభరణాలు వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. జయలలిత మరణించి ఆరేళ్లు అయినా ఆమెకు విధించిన జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె ఆస్తులు విక్రయించి జరిమానా చెల్లించేందుకు చర్యలు మొదలైయ్యాయి.
అవినీతి నిరోధకశాఖ ఆమె ఇంట్లోంచి స్వాధీనం చేసుకున్న 28కిలోల బంగారు ఆభరణాుల, 800కిలోల వెండి, వజ్రాల నగలు కోర్టుకు అప్పగించారు. వీటిని వేలం వేసి వచ్చిన సొమ్ము నుంచి జరిమానా చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆ నగలను వచ్చే నెల ఆరేడు తేదీల్లో తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగిస్తారు. వాటి విలువ దాదాపు రూ.40కోట్ల వరకు ఉంటుందని అంచనా. మిగతా రూ.60కోట్లను స్థిరాస్తులను వేలం వేయడం ద్వారా సమకూర్చనున్నారు. దీంతోపాటు కేసు ఖర్చు రూ. 5 కోట్లను కూడా ఆస్తుల వేలం ద్వారా కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించనున్నారు.