ప్రధాని మోదీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కొత్త సాంకేతికతను, మూలధనాన్ని ప్రవేశపెడుతున్నారు. అందుకు ప్రైవేట్ రంగం ఎక్కువగా పాల్గొంటోంది.
అందులో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పంటల బీమా పథకం, పీఎం కిసాన్ నీటి పారుదల స్కీమ్, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు, డ్రోన్ల వినియోగం, తేనెటీగల పెంపకం, పీఎం కిసాన్ మాన్ ధన్, వడ్డీ రాయితీ స్కీమ్ లాంటి చాలా పథకాలు అమలుచేస్తున్నారు.