కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు బీజేపీకి చెంప చెళ్లుమనిపించారు. కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ఇరు పార్టీలకు కొంచెం అటు-ఇటుగా సీట్లు వచ్చి ఉంటే మోదీ;;అమిత్ షా లు ఏదో మాయ చేసి కర్ణాటకలో గద్దెనెక్కేవారు. ఘోరపరాజయం చెందడంతో ఏం చేయాలో పాలుపోని దుస్థితికి చేరుకున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలపై ఎఫెక్ట్
ఈ వైఫల్యం.. మోదీకి 2024 సార్వత్రిక ఎన్నికలకు పెద్ద దెబ్బె అవుతుంది. కర్ణాటక ప్రభావం ఏవత్ భారతదేశ వ్యాప్తంగా రాజకీయంగా అత్యంత ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.
మోదీ సభల ప్రభావం… ప్రధాని మోదీ బీజేపీ అభ్యర్థుల తరపున కర్ణాటక అంతా కలియతిరిగారు. ఆ ప్రభావం ఏమాత్రం పనిచేయలేదు. 50 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మోడీ ఎన్నికల ప్రచారం చేస్తే.. అందులో బీజేపీ కేవలం 5 చోట్ల మాత్రమే గెలుపొందడం గమనార్హం.
రాహుల్ క్రేజ్ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో 50 నియోజక వర్గాల మీదగా వెళ్లిందని.. ఆ 50 స్థానాల్లో బీజేపీ కేవలం 4సీట్లు మాత్రమే గెల్చిందని ఏఐసీసీ సెక్రెటరీ వంశీ చందర్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ యాత్ర ప్రభావం చాలా ఉందన్నారు. డిసెంబర్లో జరిగే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్లో, రాజస్థాన్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు.