కమేడియన్ గా సినిమాల్లో ఎంటరై తర్వాత నిర్మాతగా, రాజకీయ నేతగా ఎదిగిన బండ్ల గణేశ్ కు భారీ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే రూ.95 లక్షల జరిమానా విధించింది. అలాగే కోర్టు ఖర్చులకు మరో రూ.10 వేలు కూడా భరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై టాలీవుడ్లో చర్చ నడుస్తోంది.
బండ్ల గణేశ్కు ఒంగోలుకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లకు కొన్నేళ్లుగా ఆర్థిక వివాదాలు కొనసాగుతున్నాయి. 95 లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయిందంటూ వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. కొద్దికాలంగా ఒంగోలు కోర్టులో విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా బండ్ల గణేశ్ కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం ఏడాది పాటు జైలు శిక్షను ఖరారు చేసింది. 30 రోజుల్లో 95 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.