“ప్రముఖ యోగ గురువు, పతంజలి సంస్థకు చెందిన బాబా రాందేవ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన పుంగనూర్ ఆవును కొనుగోలు చేశారు. పతంజలి సంస్థ ద్వారా అనేక ఉత్పత్తులతోపాటు ఆవు నెయ్యి కూడా మార్కెట్ చేస్తున్నారు. ఇప్పటికే రాందేవ్ ఆశ్రమంలో 5 వేల వరకు అనేక రకాల దేశీయ ఆవులు ఉన్నాయి.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కంచర్ల శివకుమార్ అనే పశు పోషకుని దగ్గర ఉన్న పుంగనూరు జాతి ఆవును రూ.4 లక్షల 10 వేలకు కొనుగోలు చేశారు. ఆవు వయస్సు మూడున్నరేళ్లు 30 అంగుళాల ఎత్తు ఉన్నది. హరిద్వార్లోని బాబా రాందేవ్ ఆశ్రమం నుండి వచ్చిన ప్రతినిధులు ఆదివారం తెనాలి వచ్చి ఈ ఆవుకు వైద్య పరీక్షలు చేయించారు. చిత్తూరు ప్రాంతంలో పుంగనూరు జాతి ఎక్కువగా ఉందని, ప్రత్యేకమైన ఈ జాతి పెంపకానికి అనువుగా ఉంటుందని వారు చెప్పారు. పశు వైద్యాధికారి నాగిరెడ్డి ఆవుకు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆశ్రమవాసులకు అప్పగించారు.