బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ రూపొందిస్తున్న రామాయణ్ సినిమాలో రావణుడి పాత్రలో నటించడానికి యశ్ రూ.150కోట్లు డిమాండ్ చేసినట్టు రూమర్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్ నటిస్తున్నాడు. అయితే అవన్నీ నిజంకావని యశ్ సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. రామాయణ్లో అతడు నటించకపోవచ్చని తెలుస్తోంది.
నటిస్తే గిటిస్తే రాముడిగా చేయాలని రావణాసురుడిగా చేస్తామంటే ఒప్పుకునేదే లేదని అభిమానులు రచ్చ చేయడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు తెలిసింది. రావణుడి పాత్ర కోసం యశ్ రూ.150 కోట్లు డిమాండ్ చేశాడట కదా? అని ప్రశ్నించినప్పుడు ఆ వర్గాలు నవ్వేశాయి. పైగా ఈ రోజుల్లో ఓ పాత్రకు అంత మొత్తం ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించాయి. ఇలాంటి రూమర్ల వల్ల ఇండస్ట్రీకి ముప్పు తప్పదని హెచ్చరించాయి.