ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మరో ఆరు రోజుల్లో 14తో ముగియనుంది. ఇప్పటీకి ఆధార్ను అప్డేట్ చేసుకోనివారు త్వరగా పూర్తిచేయకుంటే తర్వాత డబ్బులు చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 50 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అదే ఆన్లైన్లో అయితే ఉచితంగా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఆధార్ అధికారిక వెబ్సైట్ https://myaadhaar.uidai.gov.in/కు వెళ్లాలి. మన ఆధార్ నంబర్, క్యాప్చా నమోదు చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మన ఫోన్ నంబరుకు వచ్చిన ఓటీపీని నమోదుచేస్తే అడ్డేషన్కు సైట్ సిద్దమవుతుంది. అప్డేట్ డొమోగ్రాఫిక్స్ డేటా ఎంచుకుని మనం ఏమేం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రొసీడ్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే, మనం అప్డేట్ చేసే సమాచారాన్ని ధ్రువీకరించే పత్రాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.