విభిన్నమైన నటనాశైలితో సినీ అభిమానుల ఆదరాభిమానులు పొందిన హీరో నిఖిల్ సిద్ధార్థ. తాజాగా తన అభిమానులతో ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ పంచుకున్నారు. ” తర్వలోనే మేం తల్లిదండ్రులం కాబోతున్నాం. ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు కావాలి” అంటూ పేర్కొని.. సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను పోస్టు చేశారు. దీంతో ఈ పోస్టు కింద కామెంట్లు పెడుతూ సినీతారలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా దగ్గరి బంధువుల సమక్షంలో తాను ప్రేమించిన డా. పల్లవి వర్మను నిఖిల్ 2020లో వివాహం చేసుకున్నాడు.