‘బాహుబలి’ వంటి భారీ చిత్రాలతో రాజమౌళి రేంజ్ మారిపోయింది. అంతకు ముందు నుంచే జక్కన మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్.. అని ప్రకటించారు. తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ .. ‘మహాభారతం’ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి తగిన సమయం వచ్చిందనే అనుకుంటున్నాననీ, త్వరలోనే కథాపరమైన పరిశీలన మొదలవుతుందని అన్నారు. ‘మహాభారతం’ కథా వస్తువు చాలా విస్తృతమైన పరిధిలో ఉంటుందనీ, అందువలన ప్రాజెక్టు ఒక కొలిక్కి రావడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు.
మహాభారతంలో కీలకమైన పాత్రలు చాలా కనిపిస్తాయనీ, ప్రతి పాత్ర కూడా ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుందని అన్నారు. ఈ మొత్తం కథను 10 భాగాలలో చెప్పవలసి ఉంటుందనీ, ఈ ప్రాజెక్టుకు ముందు రెండు మూడు సినిమాలను చేయవచ్చని చెప్పారు. ఏడాదికి ఒక పార్ట్ అనుకున్నా, రాజమౌళి నుంచి 10 భాగాలు రావడానికి పదేళ్లకి పైన సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఒక ‘అవతార్’ .. ఒక ‘టెర్మినేటర్’ మాదిరిగా రాజమౌళి నుంచి ‘మహాభారతం’ రానుందన్న మాట. మన పురాణ గాధను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం దీని ద్వారా వస్తుంది.