ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని మంచినీటికి బదులు కుండలో పోసి నీరు ఎంతో ఆరోగ్యకరం. మట్టి కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల నీరు సహజంగా చల్లబడుతుంది. బంకమట్టి ఆల్కలీన్ స్వభావం కలిగి ఉండటంతో ఇది ఆమ్ల ఆహారాలతో సంకర్షణ చెందుతుంది. బంకమట్టి కుండలోని నీరు pH సమతుల్యతను అందించడంతో ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యను దూరం చేస్తుంది. మట్టి కుండలు… వేడి వాతావరణంలో కూడా నీటిని చల్లగా, తాజాగా ఉంచుతాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది. ఈ నీటిని తాగితే వడదెబ్బ తగిలే అవకాశం తక్కువ. చర్మం పొడిబారే (డీహైడ్రేషన్) అవకాశమూ తక్కువే.
జీవక్రియలు పెరుగుతాయి
మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు కనుక ప్రతిరోజూ కుండ నీటిని తాగితే జీవక్రియ పెరుగుతుంది. మట్టి కుండ నీరు త్రాగడం వడదెబ్బను నియంత్రిస్తుంది. మట్టి కుండ నీటిలో ఖనిజాలు, పోషకాలను చెక్కుచెదరకుండా ఉంచుతుంది కనుక త్వరగా రీహైడ్రేట్ అవుతుంది. మట్టి కుండ నీరు ఒక ఆదర్శ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది కనుక గొంతు సంబంధిత సమస్యలు దరిచేరవు.