అమెరికా మాజీ అధ్యక్షుడికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బ్యాంకులను మోసం చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు 364 మిలియన్ డాలర్లు (రూ.3వేల కోట్లకు పైగా) జరిమానా విధించింది. ట్రంప్ తన ఆస్తుల విలువను అధికంగా చూపించి బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేశారన్న ఆరోపణలున్నాయి. మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా పొందారని న్యూయార్క్ అటార్నీ జనరల్, డెమోక్రాట్ నేత లెటిటియా జేమ్స్ దావా వేశారు. దీనిపై ఇటీవల రెండున్నర నెలలపాటు కోర్టు విచారణ జరిపింది.
ఈ ఆరోపణలు నిజమని తేలడంతో న్యాయమూర్తి ఆయనకు జరిమానా విధించడంతోపాటు న్యూయార్క్కు చెందిన ఏ సంస్థలోనూ ఆయన మూడేళ్లపాటు డైరెక్టర్గా కానీ, అధికారిగా కానీ ఉండకూడదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇది సివిల్ కేసు కావడంతో జైలు శిక్ష విధించలేదని కోర్టు తెలిపింది.