మెగా డీఎస్సీ విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లా డోన్లో ఎన్ఎస్యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రికి వినతిపత్రం అందించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
నిన్న కూడా ఇదే డిమాండ్తో యూత్ కాంగ్రెస్ నేతలు మంత్రి అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. సత్తెనపల్లిలోని ఆయన ఇంటికి చేరుకున్న నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వారిని అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.