అయోధ్యలో కొలువైన రామ్లల్లాను దర్శించేందుకు పాకిస్తాన్ మమిళ సీమా హైదర్ పాదయాత్ర చేపట్టాలని సంకల్పించింది. అందుకోసం ఆమె ఉత్తరప్రదేశ్ సీఎం యోగి నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది.
యూపీకి చెందిన సచిన్పై ప్రేమతో ఆమె పాకిస్థాన్ నుంచి భారత్కు వచ్చింది. తాను హిందూ ధర్మాన్ని గౌరవిస్తానని,కృష్ణ భక్తురాలిని అని చెప్పుకుంటోంది. తాను హిందువుగా మారినట్లు తెలిపింది. పాకిస్థాన్లో ఉన్నప్పడు కూడా హిందువుల పండుగలను రహస్యంగా జరుపుకునేదానినని పేర్కొంది. సోషల్ మీడియాలో సీమా హైదర్కు అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా అక్రమంగా భారతదేశానికి తరలివచ్చింది. ఆమె ప్రస్తుతం నోయిడాలో సచిన్తో కలిసి ఉంటోంది. కాలినడకన అయోధ్యకు వెళ్లాలనుకుంటున్న సీమా హైదర్ యోగి ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. అయోధ్యకు వెళ్లేందుకు చట్టపరమైన ప్రక్రియ త్వరలో పూర్తి కానున్నదని ఆమె తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.