సోనియాకు అత్యంత సన్నిహితుడు కమల్ నాథ్ అయోధ్య వెళ్లి మర్యాద పురుషోత్తమ శ్రీ రామ చంద్ర ప్రభువు దర్శనం చేసుకొని నేరుగా ఢిల్లీ వెళ్ళారు. ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కమల్ నాథ్ బీజేపీలో చేరబోతున్నారు అంటూ.. అలాగే తన పుత్ర రత్నానికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న పరిణామం కాదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక, తెలంగాణ ఎన్నికల హామీలు లాంటివి కమల్ నాథ్ ముందు పెట్టారని కానీ వాటిని తిరస్కరించి మధ్య ప్రదేశ్ లో బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశారని జగమెరిగిన సత్యం.
శివరాజ్ సింగ్ చౌహాన్ – కమల్ నాథ్ ఉప్పు నిప్పు లాంటివాళ్లు. తెలంగాణలో కూడా బండి సంజయ్ – కెసీఆర్ కూడా అంతే. కాకపోతే తెలంగాణలో వ్యూహం ఫలించలేదు. మధ్యప్రదేశ్ లో ముందే ఒప్పందం అమలు జరిగింది.