మేడారం జనసంద్రంగా మారింది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. .. మేడారం మహా జాతర ప్రారంభమైంది. కన్నేపల్లి నుంచి సారలమ్మ, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజు ప్రతిరూపాలను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజు ప్రతిరూపాల ప్రతిష్టాపనతో తొలిఘట్టం ముగుస్తుంది. పూర్తిగా ఆదివాసీ ఆచారాల ప్రకారమే జరుగుతుంది.
నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మహా జాతరకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే 60 లక్షల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. ఈ రోజు సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు దీరనున్నారు. 23న శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకోనున్నారు. అయినప్పటికీ వన దేవతలను దర్శించుకోవడానికి వెళ్లే సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా మంత్రి సీతక్క స్వయంగా పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను చేయించారు.