‘‘పీచుమిఠాయి.. అర్ధరూపాయి.. దాన్ని కొరికిఇస్తే కోటి రూపాయిలు’’ అని పాడుకునే పాటలు ఇకపై ఉండవేమో ఎందుకంటే పీచుమిఠాయి అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆ దారిలోనే నడుస్తోంది.
దీన్ని తినడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం పీచుమిఠాయిపై పరీక్షలు నిర్వహించింది. నమూనాల్లో పారిశ్రామిక రంగు రోడమైన -బి కనిపించింది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరిలో పీచుమిఠాయిపై నిషేధం విధించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరీక్షలు నిర్వహించమని అధికారులను ఆదేశించింది. పరీక్ష ఫలితాల ఆధారంగా నిషేధంపై నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్య, రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ జె.నివాస్ తెలిపారు.