అమరావతి రాజధాని గురించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం అనుమానమేనని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఆరు నెలల క్రితం ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. దీనిపై శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ సర్కార్ సుప్రీంను ఆశ్రయిం చింది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ చర్యను ఎంపీ స్వాగతించారు. ప్రభుత్వానికి మంచి సలహ ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఎన్డీ ఆర్ఏపై పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఏపీ అసెంబ్లీలో దుర్వినియోగం చేశారని, రాజధానులను ఏర్పాటు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేస్తుందని గుర్తించుకోవాలని, రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వదని భావిస్తున్నానని అన్నారు.
ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం మూడేళ్లలో లక్షా 25 వేల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. మూడేళ్ల నుంచి తమ ప్రభుత్వం ఆర్ఓసీ ఫైల్ చేయడం లేదని విమర్శించారు.