ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశాన్ని తేల్చివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు సాధ్యంకాదని ప్రభుత్వం పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన అని ప్రభుత్వం వివరించింది.
మూడు రాజధానుల చట్టం రద్దుపై హైకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నట్లుగా ఉందని పిటిషన్లో పేర్కొంది. రాజధాని అంశంపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది.
అమరావతే రాజధాని అని ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని విన్నవించింది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఆర్డీ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది.