” దేశంలో తిరుగులేని రాజకేయ శక్తిగా అప్రతిహతంగా దూసుకుపోతున్న మోదీ-షా ఆధ్వర్యంలో బీజేపీ మరో బలమైన వ్యూహానికి కసరత్తు చేపట్టింది. 2023-24 లో తెలంగాణలో పాగా వేసేందుకు హైదరాబాద్ ను దక్షిణాది రాజధానిగా ప్రకటించాలన్న తాపత్రయం కనిపిస్తోంది. ఈ అస్త్రం ద్వారా తెలంగాణను వశం చేసుకోవచ్చన్న ఆలోచన కమలదళంలో బలంగా ఉంది.”
మోదీ-అమిత్ షా ద్వయం చేపట్టిన ఏ కార్యాన్నైనా విజయవంతంగా నెరవేర్చుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఎప్పడూ లేనంత బలహీనంగా మారడమే ఇందుకు ప్రధాన కారణం. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవాలన్నది వారి ఆశయం. ఇందుకోసం ఏ యుక్తులు వేయడానికైనా వారు వెనకాడరు.
టీడీపీ-బీజేపీ పొత్తు: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ పెద్దలు అక్కడ ఎటువంటి రాజకేయ సమీకరణాలకైనా సిద్ధమవుతున్నారు. 10 శాతం పైనే ఓటు బ్యాంక్ ఉన్న టీడీపీతో జత కడితే తెలంగాణలో పాగా వేయడం మరింత సులువవుతుందన్నది వారి ఆలోచన. దక్షిణాది రాజధాని అంశంతో పాటు టీడీపీతో టై-అప్ ఒకటి. ఇలాంటి మరికొన్ని వ్యూహాలు బీజేపీ రూపొందించుకుంటోంది. 2023 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రాలో మరో ఏడాది వరకు ఎన్నికలుండవు. ఈ లోగా తెలంగాణ కల నెరవేర్చుకుంటారు. తర్వాత 2024 లో ఏపీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కొనసాగిస్తారు.
జగన్ పై తీవ్ర వ్యతిరేఖత: ఏపీ సీఎం జగన్ వ్యవహారశైలి, పాలన, కక్ష కట్టే తీరు, ఆర్ధిక అరాచకత్వం వంటి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఆలోచన మొదలైంది. ఇప్పుడిప్పుడే జనం భవిష్యత్తుపై భయపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు తెగనమ్మి, అభివృద్ధిని విస్మరించి జనానికి డబ్బు పప్పుబెల్లాల్లా పంచుతున్నారు. బెనిఫిట్ పొందుతున్న వారు సైతం దీనిపై ఆలోచన చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు పై ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత దిగిజారే ప్రమాదం ఉంది. ఈ దృష్టి కోణంలోనూ ఏపీలో వైసీపీతో కటీఫ్ చేసుకుని టీడీపీతో జత కట్టాలని మోదీ-అమిత్ షా లకు కూడా వారి సలహాదారులు చెపుతున్నారు. ఈ పరిణామాలన్నీ రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి బాగా కలసివస్తాయి. కాకపొతే ఆ పార్టీ వాటిని ఎంత సమర్దవంతంగా ఉపయోగించుకుంటుందో చూడాలి.